అతడి పిలుపు…వెయ్యి వీణల స్వర
తంత్రులు ఒకేసారి మోగినట్టు వినిపించేది.!!
*నాటిపలకరింపే..నేటి ప్రేమ చిలకరింపు..!!
కవిత్వమంటే అనుభూతేనా? రమాదేవి కవిత్వంలో టన్నులకొద్ది అనుభూతికనిపిస్తుంది..కవిత్వమంటే మధురమైన ‘అనుభూతే’ అన్నట్టు రమాదేవి కవితాప్రస్థానం కొనసాగుతోంది.కవితా..వస్తువు(ప్రేమ)ఒకటే అయినా,ఆయాసందర్భాన్నిబట్టిఅది రంగు,రుచి మార్చుకుంటుంది..ఈరోజు కాఫీటైమ్లో ప్రస్తావిస్తున్న కవిత కూడాఅనుభూతికవితే.రమాదేవి ఓ జ్ఞాపకాల ముల్లె..అందులోంచి ఒక్కోజ్ఞాపకం సీతాకోకై ఎగురుతుంటుంది.ఎంచక్కా.. దాన్ని పట్టు కొని కవిత్వం చేస్తుంటారు రమాదేవి.ఇదిగో ఇలా..ఎందుకో …,నీలాకాశం మొత్తంగా సొంతమైనట్టు...ఒడినిండా చుక్కలెన్నో తెంపుకున్నట్టు..నది నాకై వర్షమైనట్టుకొండ గొడుగై దరిచేరినట్టు...స్వర్ణ కిరణమొకటి తాకింది
ఓహ్..!
గాలి కంటే తేలికైపోయాను
వెన్నెల కంటే అపురూపమైపోయాను
ఓయ్ !
ఆనాటి సమయం నన్ను చేరిందేమో మరి
నాటి పలకరింపు మళ్లీ పలకరించింది
నువ్వు మరింత నా నువ్వే... కదూ” ❤️
కంటికి కనిపించని,చెవులకు వినిపించని మనో
వల్లభుడ్ని ఊహించుకొని, ఆ జ్ఞాపకాలనెమరుతో అనుభూతి ప్రధానంగా ఈ కవిత రాశారురమాదేవి.
ఈమె అనుభూతి భూమిలా విశాలమైంది.ఆకాశం
లా ఎత్తైనది.అయినా ఆమౄ అనుభూతిముందు
భూమ్యాకాశాలు తలొంచాల్సిందే..!
నీలాకాశం మొత్తం ఆమె సొంతమైనట్టు...ఆకాశం
లోని చుక్కల్ని ఒడినిండా తెంపుకున్నట్టుంది ఆమె
కు..ఆమెకోసమే నది వర్షించినట్టు..పక్కనే వున్న కొండ గొడుగై దరిచేరినట్టు.స్వర్ణ కిరణమొకటి ఆమెను తాకింది..దాంతో ఆమె గాలి కంటే తేలికైనట్టు,వెన్నెల కంటే అపురూపమైపోయిన ఫీలింగ్..
ఏమిటిదంతా.?
ఎందుకిలా జరుగుతోంది..?
అంటే….
తను,అతగాడు కలిసి మురిసి విరిసిన ఆనాటిజ్ఞాపకం అనుభూతి సంద్రమై తన దరిచేరింది. అందుకే…నాటి పలకరింపు మళ్లీ పలకరించినట్టనిపించిందామెకు..: అంటే….? అతను…. తన మనోవల్లభుడేనా?…
కాబట్టే..కదా!
అతగాడు తన దరిచేరి పిలిచినట్టనిపించింది
ఆ పలకరింపు కూడా పరిచయమున్నదే…
తను తరచూ విన్నదే. అనుమానంలేదు.
తను ఎవరికోసమైతే ఎదురుచూస్తుందో..
అతగాడే….
అందుకే…తనకీ భావన,అనుభూతి
లేకుంటే ….
ఇలాంటి వో తన్మయత్వపు అనుభూతి ఊరకే
కలగదు కదా! అని అనుకుందామె..!
చల్లగాలి తగిలితే…..మేఘుడు పిలిచినట్టు,
పూ పరిమళం సోకగానే అతగాడు వస్తున్నట్టు
లెక్క..పిలుపు వినబడగానే అతడు దరిచేరిన మధురానుభూతి.
అతని సమక్షంలో కాలం ఘనీభవించేది…
రోజులు క్షణాలయ్యేవి….
అతడు ఆకాశమైతే..తను భూమి..
కురిసిన వర్షం ప్రేమ చిలకరింపయ్యేది.
ఈ భూమ్యా కాశాల సరస సంగమ కాంక్షే
ఈ అనుభూతికి మూలమైంది..!!
అవును మరి?
శిలను శిల్పంచేసే క్రమంలో…,
శిల్పి ఉలిదెబ్బ శబ్దం వినబడగానే
శిల ఉలికిపడి..,పరవశించినట్టు…
అతడి పిలుపు వినబడగానే..
వెయ్యి వీణల స్వరతంత్రులు ఒకేసారి
మోగినట్టు….
నాటి ఆ పలకరింపు ఫలితమే ..
నేటి ఈ ప్రేమ చిలకరింపు..!
ఔను..
అనుమానం లేదు..
ఆదే పిలుపు…
అతగాడిదే..ఆ పిలుపు.
నో డౌట్..? అంటోంది ….
ఈ ప్రేమ కవయిత్రి రమాదేవి..!
*ఎ.రజాహుస్సేన్..!!